శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ.3.75 కోట్లు

శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ.3.75 కోట్లు

 జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి భారీగా ఆదాయం సమకూరింది. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠమైన భద్రత మధ్య  ఆలయ సిబ్బంది, శివసేవకులు ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపు చేశారు.  గత 28 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మెక్కులు, కానుకలతోపాటు అన్నదాన భవనంలోని హుండీలో వేసిన మెక్కులు నగదు రూపంలో3 కోట్ల 75 లక్షల 21 వేల 688 రూపాయలు  ఆదాయంగా వచ్చినట్లు ఈవో లవన్న తెలిపారు. వీటితోపాటు350 గ్రాముల  500 మిల్లీగ్రాముల బంగారం, 6 కేజీల 280  కిలోల వెండి ఆభరణాలు, విదేశీ కరెన్సీని స్వామి అమ్మవార్లకు మెక్కులుగా హుండీలో భక్తులు సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.