గుంటూరు కారంలో మురిపించే..మురారీ జోడీ..నిజమేనా?

 గుంటూరు కారంలో మురిపించే..మురారీ జోడీ..నిజమేనా?

సంక్రాంతికి రాబోతున్న క్రేజీ సినిమాల్లో మహేష్ బాబు(Maheshbabu) ‘గుంటూరు కారం (Gunturkaram)  ఒకటి. భారీ అంచనాల మధ్య డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన సాంగ్స్, పోస్టర్స్ ఆడియన్స్ని ఆకట్టుకుంటున్నాయి. లేటెస్ట్గా ఈ సినిమా నుంచి అదిరిపోయే న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఇప్పటికే మహేష్కి జోడీగా బ్యూటీ శ్రీలీల (Sreeleela), మీనాక్షి చౌదరి (Meenakshi chaudary) హీరోయిన్స్గా నటిస్తున్నారు. అంతేకాకుండా..గురూజీ సూపర్ ఫ్యాన్స్ అభిమానులకు మరో స్పెషల్ స‌ర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు సమాచారం. 

ఈ సినిమాలో ఓ గెస్ట్ క్యారెక్టర్ కోసం మహేష్ భామ..ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ సోనాలీ బింద్రేని(Sonalibendre) సెలెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. మురారి సినిమాలో అట పాటలతో..అల్లరి చేష్టలతో ఆడియన్స్ను అలరించిన ఈ జోడీ మళ్ళీ తెరపై కనిపిస్తున్నారంటే సూపర్ ఫ్యాన్స్కి సూపర్ న్యూస్ అనే చెప్పుకోవాలి. గుంటూరు కారంలో సోనాలి తెర‌పై కాసేపు క‌నిపించ‌నుందట‌. కానీ. ఆమె కనిపించే ఇర‌వై నిమిషాలు కూడా మహేష్ బాబుతో మాత్రమే ఉండేలా..ఆడియన్స్ కి ఆసక్తికరంగా అలరించేలా త్రివిక్రమ్ ప్లాన్ చేసాడని సమాచారం. ఇదే నిజ‌మైతే మురారీ జోడీతో అభిమానులను మురిపించిన‌ట్లే.

దాదాపు రెండు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హారిక హాసిని క్రియేషన్స్ (Harika hasini creations) పై చినబాబు (Chinababu), సూర్యదేవర నాగవంశీ (Suryadevara nagavanshi) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12 న సంక్రాంతి కానుకగా థియేటర్లోకి రానుంది.