
అపెక్స్ కమిటీ సమావేశాన్నివాయిదా వేయాలని సీఎం కేసీఆర్ అడగడంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుసున్న జలవివాద విషయమై తాను కేంద్ర మంత్రి కి పిర్యాదు చేస్తే ఆయన వెంటనే స్పందించారన్నారు. ఇద్దరు సీఎం లతో ఆగస్ట్ 5 న సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు ఆ కేంద్ర మంత్రి తెలుపగా… తనకు బిజీ షెడ్యూల్ ఉందని.. అదే మీటింగ్ ఆగష్ట్ చివరి వారం పెట్టాలని సీఎం కేసీఆర్ అనడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు.
“ఏం పీకుడు పని ఉందని సమయం లేదని అంటున్నాడు? అపెక్స్ కమిటీ వాయిదా వేయాలని ఆ(ఏపీ) రాష్ట్ర సీఎం కోరాలి.. కానీ ఈ సీఎం అడుగుతున్నాడు. సెక్రటేరియట్ కూల్చడానికి సమీక్షల మీద సమీక్షలు నిర్వహించిన సీఎం.. ఈ విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదు? డగుల్బాజీ సీఎం.. ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తున్నాడు? సీఎం కి అంత బిజీ షెడ్యూల్ ఏంటో బహిర్గతం చేయాలి. వీడియో కాన్ఫరెన్స్ లో అరగంట మాట్లాడే సమయం లేదా సీఎం కి” అని బండి సంజయ్ ఫైర్ అయ్యారు.సీఎం కేంద్రం పై చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు.
ఈ వ్యవహారంలో కేసీఆర్ తనకు లాభం జరిగేలా వ్యవహరిస్తున్నాడని ఎంపీ అన్నారు. కేంద్రం పై మాట్లాడుతున్న సీఎం .. ap పై, జగన్ పై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. జగన్ తన బండారం బయట పెడతాడు అని కేసీర్ భయపడుతున్నాడని అన్నారు. ఇద్దరు సీఎం లు కలిసి రాష్ట్రాన్ని దోచుకుందామనుకుంటున్నారని, సెంటిమెంటును వాడుకొని లబ్ది పొందాలని చూస్తున్నారని అన్నారు. బీజేపీ ఇద్దరు సీఎం ల ఆగడాలు అడ్డుకుంటుందని, పక్క రాష్ట్రాల సీఎం లను కలుపుకున్నా భయపడేది లేదని అన్నారు. బీజేపీ జాతీయ పార్టీ అని.. ఏ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకం కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం లో బీజేపీ ముందుంటుందని అన్నారు. తమ పార్టీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, రి డిజైన్ ల పేరుతో దండుకోవడానికి వ్యతిరేకమని అన్నారు. సీఎం ఫార్మ్ హౌస్, ప్రగతి భవన్ కె పరిమితమని తెలంగాణ ప్రజలకు తెలుసని అన్నారు.