ఐపీఎల్-2022లో శనివారం ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్ లో హైదరాబాద్ బౌలర్స్ అద్భుతంగా రాణించారు. జస్ట్ 68 పరుగులకే ఆలౌట్ చేసి ఔరా అనిపించారు. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీని ప్రారంభంలోనే రైజర్స్ దెబ్బ కొట్టింది. 8 పరుగలకే డుప్లెసిస్, విరాట్ కోహ్లి,అనుజ్ రావత్ వికెట్లు కోల్పోయింది. జాన్సెన్ వేసిన రెండో ఓవర్లో ఆర్సీబీ మూడు వికెట్లు కోల్పోయింది. కోహ్లీ ఈ సీజన్లో వరుసగా రెండో సారి గోల్డన్ డక్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన ప్లేయర్లందరూ రైజర్స్ బౌలింగ్ దెబ్బకు వరుసగా పెవిలియన్ బాట పట్టారు.
జానెసన్,నటరాజన్ దెబ్బకు ఆర్సీబీ బ్యాటర్లు విలవిలాడారు. జానెసన్, నటరాజన్ చెరో మూడు వికెట్లు సాధించగా, సుచిత్ రెండు, ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్ తలా వికెట్ సాధించారు. ఆర్సీబీ బ్యాటర్లలో సుయాష్ ప్రభుదేసాయి 15 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.
Stellar bowling performance from #SRH as they bundle out #RCB for just 68
— IndianPremierLeague (@IPL) April 23, 2022
3 wickets for Jansen and 3 for T Natarajan who ended up with figures of 3/10 and he is our top performer for his economical bowling figures!
Follow the match: https://t.co/f9ENkwNWAn#TATAIPL | #RCBvSRH pic.twitter.com/UViVjaCFGi