- సమస్యలు పరిష్కరిస్తామని కమిషనర్ హామీ
హైదరాబాద్, వెలుగు: మిల్లర్లతో సివిల్సప్లయ్స్ కమిషనర్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో ధాన్యం కొనుగోళ్లపై నెలకొన్న అనిశ్చితి, అడ్డంకులు తొలగినట్లయింది. మంగళవారం ఎర్రమంజిల్లోని సివిల్ సప్లయ్స్ భవన్లో మిల్లింగ్ అసోసియేషన్ల ప్రతినిధులతో సివిల్ సప్లయ్స్ శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మిల్లర్ల సమస్యలను కమిషనర్ దృష్టికి ప్రతినిధులు తీసుకెళ్లారు.
మిల్లింగ్ఇండస్ట్రీకి ఇబ్బందులు కలుగకుండా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. బాయిల్డ్ రైస్ వివాదంపై కేంద్రంతో సంప్రదింపులు జరిపి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈనెల 16న స్టేట్ అసోసియేషన్ఆధ్వర్యంలో సమస్యలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని అసోసియేషన్ ప్రతినిధులు వివరించారు.

