2 నెలలకు సరిపడా ఫుడ్ నిల్వ చేస్కోండి.. పీవోకేలో ప్రజలకు అలర్ట్

2 నెలలకు సరిపడా ఫుడ్ నిల్వ చేస్కోండి.. పీవోకేలో ప్రజలకు అలర్ట్

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడితో భారత్‌‌, పాక్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ  నేపథ్యంలో  రెండు నెలలకు సరిపడా ఆహారం నిల్వ చేసుకోవాలని స్థానికులను పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) యంత్రాంగం కోరినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. నియంత్రణ రేఖ (ఎల్‌‌వోసీ) వెంబడి ఉన్న13 నియోజకవర్గాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పీవోకే ప్రధాని చౌదరి అన్వర్ ఉల్ హక్ సూచించినట్లు వెల్లడించాయి. 

ఉల్ హక్ మాట్లాడుతూ.. “ఆహారం, మెడిసిన్స్  ఇతర మౌలిక అవసరాల కోసం పీవోకే ప్రభుత్వం రూ. 100 కోట్లతో ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసింది” అని పేర్కొన్నారు. కాగా..భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్ జాతీయ విమానయాన సంస్థ (పీఐఏ) బుధవారం గిల్గిట్, స్కర్దూ, ఇతర ఉత్తర ప్రాంతాలకు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.