గుండెపోటుతో పదో తరగతి విద్యార్థి మృతి

గుండెపోటుతో పదో తరగతి విద్యార్థి  మృతి

నారాయణపేట జిల్లాలో దారుణం జరిగింది. గుండె పోటుతో పదో తరగతి విద్యర్థి మృతి చెండదాడు. వివరాల్లోకి వెళితే నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కొండాపూర్ గిరిజన గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి శ్రీకాంత్ గుండెపోటుతో మృతి చెందారు. హస్టల్ లోని తన గదిలోకి వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. హుటాహుటిన పాఠశాల సిబ్బంది అతన్ని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే గుండె పోటుతో మరణించినట్టు డాక్టర్లు నిర్ధారించారు.