టాయిలెట్స్ కోసం స్టూడెంట్ల ధర్నా

టాయిలెట్స్  కోసం స్టూడెంట్ల ధర్నా

మహబూబ్ నగర్  జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్  ఉన్నత పాఠశాలలో టాయిలెట్స్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే టాయిలెట్లు ఏర్పాటు చేయాలని స్టూడెంట్లు మంగళవారం స్కూల్  ఆవరణలో ధర్నా చేశారు.

భోజన విరామం తర్వాత క్లాసులు బైకాట్  చేసి బైఠాయించారు. వారు మాట్లాడుతూ టాయిలెట్లు లేకపోవడంతో తమతో పాటు లేడీ టీచర్లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అప్పుడప్పుడు కడుపునొప్పులు కూడా వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే టాయిలెట్స్  ఏర్పాటు చేయాలని కోరారు. - వెలుగు, అడ్డాకుల