ఇబ్రహీంపట్నం/ఆత్మకూర్/దేవరకద్ర, వెలుగు: ఏ కష్టం వచ్చినా వెన్నంటే ఉండి నడిపించిన నాన్న ఇక లేడన్న విషయం తెలిసినా పుట్టెడు దుఃఖంలోను పరీక్షకు హాజరయ్యారా స్టూడెంట్లు. పరీక్ష తర్వాత అంత్యక్రియల్లో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోజన్కొత్తూర్ కు చెందిన చల్ల లక్ష్మి–- నర్సయ్యల కుమార్తె త్రిష. ఇబ్రహీంపట్నం మోడల్స్కూల్లో టెన్త్చదువుతోంది. బుధవారం అర్ధరాత్రి నర్సయ్య అనారోగ్యంతో మృతిచెందాడు. ఆ బాధను దిగమింగి త్రిష గురువారం పదో తరగతి పరీక్షకు హాజరైంది.
నారాయణపేట జిల్లా ఆత్మకూర్కు చెందిన మున్నూరు హన్మంత్ రెడ్డి(48) బుధవారం అర్ధరాత్రి అస్వస్థతకు గురై చనిపోయాడు. ఆయన కూతురు అఖిల టెన్త్ పరీక్షలకు హాజరైన తర్వాత అంత్యక్రియల్లో పాల్గొంది. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన రవి తండ్రి వెంకటేశ్వర్లు కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కర్నూల్ ఆసుపత్రికి బుధవారం మృతిచెందాడు. రవి టెన్త్ పరీక్ష రాసొచ్చిన తర్వాత స్వగ్రామంలో అంత్యక్రియల్లో పాల్గొన్నాడు.- –
అన్న చనిపోయిండు
గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం బుడుమర్సు గ్రామంలోని భరత్ పీజీ చేస్తున్నాడు. అనారోగ్యంతో నిమ్స్లో బుధవారం రాత్రి చనిపోయాడు. భరత్ చెల్లి సంపూర్ణ ఆ బాధతోనే పరీక్ష రాసి వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొంది.
మరిన్ని వార్తలు