
టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సుహాస్(Suhas) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ప్రసన్నవదనం(Prasannavadanam). పేస్ బ్లైండ్ అనే సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను కొత్త దర్శకుడు అర్జున్ వైకే(Arjun YK) తెరకెక్కించాడు. టీజర్, ట్రైలర్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకుంది. కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రాబట్టింది. అతితక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ఫస్ట్ వీక్ లోనే రూ.5 కోట్ల గ్రాస్ రాబట్టి బ్రేకీవెన్ సాధించడమే కాకుండా.. మేకర్స్ కు లాభాలు తెచ్చిపెట్టింది ఈ మూవీ.
ఇదిలా ఉంటే.. తాజాగా ప్రసన్నవదనం సినిమా ఓటీటీ విడుదల గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. అనుకున్నదానికన్నా ముందే ఈ సినిమా ఓటీటీకి రానుందట. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఈ సినిమా హక్కులను దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం మేరకు మే 31న ఈ సినిమా ఓటీటీకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ డేట్ వైరల్ అయినప్పటికీ.. అధికారిక ప్రకటన రాలేదు.
ఇక ప్రసన్నవదనం సినిమా కథ విషయానికి వస్తే.. సూర్య(సుహాస్) ఎఫ్ఎం స్టేషన్ లో ఆర్జే గా పని చేస్తుంటాడు. అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ లో తల్లితండ్రులను కోల్పోతాడు. అంతేకాదు.. ఆ యాక్సిడెంట్ కారణంగా సూర్యకి పేస్ బ్లైండ్ నెస్ అనే అరుదైన డిజార్డర్ ఏర్పడుతుంది. ఆ కారణంగా సూర్య ఎవరి మొహాలని గుర్తుంచలేడు. ఒకరోజు అర్ధరాత్రి దారుణమైన హత్యను చూస్తాడు సూర్య. కానీ, హత్య చేసిన వ్యక్తి ఎవరు అనేది గుర్తు పట్టలేడు. మరి ఆ వ్యక్తిని సూర్య ఎలా గుర్తుపట్టాడు? ఫేస్ బ్లైండ్ నెస్ కారణంగా సూర్య ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? అనేది ప్రసన్నవదనం కథ.