సమాజ్ వాదీ పార్టీకి షాక్.. ఎన్డీయేలో చేరిన ఎస్బీఎస్పీ

సమాజ్ వాదీ పార్టీకి  షాక్.. ఎన్డీయేలో చేరిన ఎస్బీఎస్పీ

యూపీలో  అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీకి మరో షాక్ తగిలింది. మిత్రపక్షమైన సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) తిరిగి ఎన్డీయే కూటమిలో చేరింది. తాము ఇకపై బీజేపీతో కలిసి పనిచేస్తామని ఆ పార్టీ చీప్ ఓం ప్రకాశ్ రాజ్ భర్ ప్రకటించారు.

ఎస్పీ, బీఎస్పీ కలిసి వస్తే పోరాడుదామనుకున్నాం కానీ.. అన్ని పార్టీలతో మాట్లాడేందుకు ప్రయత్నించినా  ఎలాంటి స్పందన లేదని  రాజ్ భర్ చెప్పారు.  ఇంకా ఎన్ని రోజులు వేచి చూడాలని.. అందుకే  సామాజిక న్యాయం, దేశ భద్రత మహిళా సాధికారత కోసం ప్రధాని, హోంమంత్రి నాయకత్వంలో పనిచేయాలని  నిర్ణయించుకున్నామని చెప్పారు.