ఎగ్జామ్స్‌ సరిగా రాయలేదని కోసుకున్నాడు

ఎగ్జామ్స్‌ సరిగా రాయలేదని కోసుకున్నాడు

వెలుగు: పట్టణంలోని ప్రగతి జూనియర్ కాలేజీకి చెందిన ఇంటర్ సెకండ్‌ ఇయర్‌ స్టూడెంట్‌ మాచర్ల తరుణ్ బ్లేడ్ తో గొంతు, మర్మావయాలు కోసుకుని మంగళవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రాణాపాయాస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నల్లగొండ రూరల్​ ఎస్సై మురళి, స్టూడెంట్‌ పేరెంట్‌ రాములు చెప్పిన దాన్ని బట్టి…మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ ఎగ్జామ్స్‌ సరిగా రాయలేదని మనో వేదనకు గురై సోమవారం పరీక్ష రాసిన తరువాత తాను కాలేజీ హాస్టల్​కు వెళ్లకుండా హైదరాబాద్​ రోడ్డులోని పాలిటెక్నిక్​ కాలేజీ వైపు వెళ్లాడు. తోటి స్టూడెంట్స్‌ హాస్టల్​కు తీసుకెళ్లే ప్రయత్నం చేసినా ఒప్పుకోలేదు. తర్వాత వస్తానని చెప్పడంతో వారు వెళ్లారు .

కాలేజీ వద్ద స్పృహ తప్పిపడిపోయి…
సోమవారం సాయంత్రం హాస్టల్​కు వెళ్లకుండా పాలిటెక్ని క్​ కాలేజీ వద్ద రాత్రి 8 గంటలప్పుడు బ్లేడ్ తో ఎడమ చేయి కోసుకున్నాడు. స్పృహ తప్పి పడిపోయాడు. రాత్రి 12 గంటలకు స్పృహలోకి వచ్చి బతికి ఉన్నా నని, మళ్లీ బ్లేడ్ తో గొంతు కోసుకున్నాడు. దీంతో మరోసారి రక్తస్రావంతో కుప్పకూలాడు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు మెలకువ వచ్చి ఆత్మహత్య చేసుకోవాలని భావించి మర్మావయాలను కోసుకున్నాడు. వాకింగ్ కు వచ్చి న వారంతా గమనించి పోలీసులకు, అంబులెన్స్​కు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు.