రూ. వెయ్యి కోట్ల మైలురాయిని సాధించిన సుందరం హోమ్​ఫైనాన్స్​

రూ. వెయ్యి కోట్ల మైలురాయిని సాధించిన సుందరం హోమ్​ఫైనాన్స్​

చెన్నై: దక్షిణాదియేతర మార్కెట్లలో భారీగా లోన్లు ఇవ్వడంతో సుందరం హోమ్ ఫైనాన్స్ రూ. 1,000 కోట్ల మార్కును అధిగమించింది. 2024-–25 ఆర్థిక సంవత్సరంలో దక్షిణాదియేతర మార్కెట్లలో చేసిన చెల్లింపులతో ఈ మైలురాయిని అందుకున్నామని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సుందరం హోమ్ ఫైనాన్స్ అనేది సుందరం ఫైనాన్స్ లిమిటెడ్  పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ. ఇది హోం లోన్లు,  ప్లాట్ లోన్లు, ఆస్తిపై లోన్లు, బిజినెస్​లోన్లను వ్యాపారులకు,  రిటైలర్లకు అందిస్తుంది.  చెన్నై ప్రధాన కార్యాలయం కలిగిన కంపెనీ మహారాష్ట్ర, రాజస్థాన్,  మధ్యప్రదేశ్‌‌‌‌లలో వ్యాపారాన్ని విస్తరించింది. 

ఛత్తీస్‌‌‌‌గఢ్ మార్కెట్‌‌‌‌లోకి కూడా ప్రవేశించింది. మార్చి 31, 2025తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి, సుందరం హోమ్ ఫైనాన్స్ రూ. 6,517 కోట్ల లోన్లు ఇచ్చింది. గత ఆర్థిక సంవత్సరం (2023-–24 ఆర్థిక సంవత్సరం) లో ఇచ్చిన రూ. 5,039 కోట్ల విలువైన లోన్లతో పోలిస్తే 29 శాతం ఎక్కువ.   గత సంవత్సరం దక్షిణేతర మార్కెట్లలో  రూ. 1,000 కోట్ల విలువైన హోం లోన్లు మంజూరు చేశామని, తమ  ప్రయాణంలో ఇదొక ముఖ్యమైన మైలురాయి అని కంపెనీ ఎండీ లక్ష్మీనారాయణన్ అన్నారు.

 తమ సంస్థను దేశవ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పారు. ఇందుకోసం కొత్త శాఖలను ప్రారంభిస్తామని,  ఇప్పటికే ఉన్న ప్రదేశాలలో ఉనికిని బలోపేతం చేస్తామని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి, కంపెనీ దక్షిణేతర మార్కెట్​కు రూ. 1,500 కోట్ల విలువైన లోన్లను ఇవ్వాలని ఆశిస్తోంది. సుందరం హోమ్ ఫైనాన్స్​కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 150 కి పైగా శాఖలు ఉన్నాయి.