అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి

 అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి

జగిత్యాల జిల్లా: అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా  రాయికల్ మండలంలోని పలు గ్రామాల్లో నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు. కల్లాల్లో వరి ధాన్యం తడిసి రైతులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. నష్టపోయిన పంటలను అధికారులు  పరిశీలించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

 

ఇవి కూడా చదవండి

కేటీఆర్ కామెంట్స్కు ఏపీ మంత్రుల కౌంటర్

దేశంలోనే బెస్ట్ సిటీ హైదరాబాద్

వావ్: స్టూడెంట్ తో కలిసి టీచర్ స్టెప్పులు