న్యూఢిల్లీ, వెలుగు : కృష్ణా జలాల వివాదం కేసు విచారణను సుప్రీంకోర్టు మార్చి 13కు వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కృష్ణా ట్రిబ్యునల్–2కు సంబంధించి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీవోఆర్)పై స్టే విధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. గత విచారణ సందర్భంగా కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఏపీ దాఖలు చేసిన పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
ఈ పిటిషన్ను సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ల బెంచ్ విచారించింది. ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్ లాయర్ జైదీప్ గుప్తా వాదనలు వినిపిస్తూ.. కేసుకు సంబంధించి ప్లీడింగ్స్ పూర్తయ్యాయని, వాదనలకు కొంత సమయం కావాలని కోరారు. ఇందుకు అంగీకారం తెలిపిన బెంచ్.. విచారణను వచ్చే నెల 13కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.