ఎన్ కౌంటర్ పై 11న సుప్రీం విచారణ

ఎన్ కౌంటర్ పై 11న సుప్రీం విచారణ

దిశ కేసులో నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన ఘటనపై దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టులో ప్రస్తావనకు వచ్చింది. దీనిపై విచారణను అత్యవసరంగా చేపట్టాలని పిటిషనర్ కోరారు. ఈ ఎన్ కౌంటర్ బూటకమని తెలిపిన ఆయన.. ఎన్ కౌంటర్లపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పోలీసులు పాటించలేదన్నారు.

ఇప్పటికే తెలంగాణ హైకోర్టు దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణ చేస్తోందన్నారు సీజేఐ బోబ్డే. పిటిషన్ పై ఈ నెల 11న(బుధవారం) విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు..దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై మొదట ఒక పిటిషన్ దాఖలు కాగా… ఇవాళ మరో పిటిషన్ దాఖలైంది. రెండు పిటిషన్లను కలిపి ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు హైకోర్టు విచారించనుంది.