
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అలహాబాద్ నగరం పేరును ప్రయాగరాజ్గా మారుస్తూ తీసుకున్న నిర్ణయంపై ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కారుకు నోటీసులు జారీ చేసింది. యూపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పరిధిలోని రైల్వేస్టేషన్, సెంట్రల్ యూనివర్శిటీలు, ఇతర కేంద్ర సంస్థల పేర్లను మార్చే హక్కు లేదని పిటిషనర్ సుప్రీంకోర్టులో సమర్పించిన పిటిషన్ పై ఈ నోటీసులు జారీ చేసింది. 500 ఏళ్ల క్రితం మొఘల్ రాజు అక్బర్ పెట్టిన అలహాబాద్ నగర పేరును ప్రయాగరాజ్ గా బీజేపీ ప్రభుత్వం ఎలా మారుస్తుందని పిటిషనర్ ప్రశ్నించారు. పురాతన పేరు పెట్టామని బీజేపీ చెపుతుందని… కానీ నాటి అక్బర్ పెట్టిన పేరును మార్చడం చరిత్రను వక్రీకరించడమేనని పిటిషనర్ తెలిపారు. 1575వ సంవత్సరంలో మొఘల్ రాజు అక్బర్… అలహాబాద్ అని పేరు పెట్టారని పిటిషనర్ తెలిపారు.