ఏపీ మెడికల్ స్టూడెంట్స్ పిటిషన్ .. విచారణకు సుప్రీం నో

ఏపీ మెడికల్ స్టూడెంట్స్ పిటిషన్ .. విచారణకు సుప్రీం నో

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ మెడికల్ కాలేజీల్లో 100 శాతం సీట్లు స్థానికులకే కేటాయిస్తూ తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ మెడికల్ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణకు సుప్రీంకోర్టు నో చెప్పింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నెలకొల్పిన మెడికల్ కాలేజీల్లో ‘కాంపిటెంట్ అథారిటీ కోటా’ లో 100 శాతం సీట్లు స్థానికులకే కేటాయిస్తూ జులై 3న తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు వెలువరించింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీకి చెందిన పలువురు మెడికల్ కాలేజ్ స్టూడెంట్లు ఈ నెల 29న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను గురువారం జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఎస్ వి ఎన్ భట్టితో కూడిన బెంచ్  విచారణకు నిరాకరించింది.