ఢిల్లీ అల్లర్లపై సుప్రీం సీరియస్

ఢిల్లీ అల్లర్లపై సుప్రీం సీరియస్

ఢిల్లీ అల్లర్లపై  దాఖలైన  పిటిషన్ పై  విచారణ జరిపింది  సుప్రీంకోర్టు. అయితే  దీనిపై   ఢిల్లీ  హైకోర్టులో  విచారణ జరుగుతోందని, పోలీసులకు  కోర్టు నోటీసులు  కూడా ఇచ్చిందని  సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా  కోర్టుకు చెప్పారు . దీంతో విచారణ  అవరసం లేదని పిటిషన్ ను  పక్కన పెట్టింది  సుప్రీంకోర్టు  ధర్మాసనం. షహీన్ బాగ్ నిరసనలపై  దాఖలైన  పిటిషన్లపైనా  సుప్రీంకోర్టులో  విచారణ జరిగింది.  ఇరు పక్షాలు   చర్చల ద్వారానే  సమస్యను పరిష్కరించుకోవాలని   అభిప్రాయపడిన  ధర్మాసనం.. విచారణను మార్చి  23కు  వాయిదా వేసింది. ఇరు పక్షాలు  బాధ్యాతాయుతంగా వ్యవహరించాలని  సూచించింది  సుప్రీంకోర్టు.