
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు అరుదైన గౌరవం లభించింది. సూర్య నటించిన జై భీమ్, ఆకాశమే నీ హద్దురా సినిమాలు ఆస్కార్ వరకు వెళ్లి వెనక్కి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆస్కార్ ను అందజేసే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్లో ప్యానల్ సభ్యుడిగాఉండాల్సిందిగా సూర్యకు అహ్వానం లభించింది. ఇలా అహ్వానం అందుకున్న తొలి సౌత్ హీరో సూర్యనే కావడం విశేషం. 2022 అవార్డు ఫంక్షన్కు ప్రపంచ వ్యాప్తంగా 397మందికి ఆహ్వానం రాగా అందులో సూర్య ఒకరు. ఇందులో సూర్యతో పాటుగా బాలీవుడ్ నటి కాజోల్ దేవగన్ కూడా ఉన్నారు. ఈ విషయం తెలియగానే సూర్య అభిమానుులు ఫుల్ ఖుషిలో ఉన్నారు. ఇక సూర్య సినిమాల విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం బాలా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో సూర్య సరసన కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది.