
టీ20 వైస్ కెప్టెన్ పదవి తన ఆటకు దక్కిన ప్రతిఫలం అని టీమిండియా ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. వైస్ కెప్టెన్సీ ఇవ్వడం గురించి తనకు ఎలాంటి అంచనాలు లేవన్నాడు. అయితే గతేడాది ఆడిన ఆటకు వైస్ కెప్టెన్సీ బహుమతిగా భావిస్తున్నట్లు చెప్పాడు. ఎన్నో ఏండ్ల కష్టానికి ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నట్లు తెలిపాడు. వైస్ కెప్టెన్సీ రావడం సంతోషంగా ఉందని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. కొత్త బాధ్యతలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.
నేను నమ్మలేకపోయా..
టీ20ల్లో వైస్ కెప్టెన్గా ఎంపికవడాన్ని తాను నమ్మలేకపోయానని సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. శ్రీలంక సిరీస్ కు బీసీసీఐ టీమ్ను ప్రకటించిన తర్వాత తన తండ్రి జాబితాను పంపాడని..అందులో తన పేరును వైస్ కెప్టెన్గా మెన్షన్ చేయడాన్ని నమ్మలేకపోయానన్నాడు. ఆ తర్వాత మరోసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి తన తండ్రిను అడిగినట్లు చెప్పుకొచ్చాడు. వైస్ కెప్టెన్ గురించి నాన్నతో చర్చించానని..అయితే ఎక్కువ ఒత్తిడికి కాకుండా బ్యాటింగ్ను ఆస్వాదించాలని సూచించినట్లు వివరించాడు.
లంక సిరీస్కు వైస్ కెప్టెన్గా ఎంపిక..
2023 జనవరిలో టీమిండియా శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్కు టీమ్ను ప్రకటించిన బీసీసీఐ.. సూర్యకుమార్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేసింది.
నెం.1 ర్యాంకు..
2022లో సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో సత్తా చాటాడు. 2022లో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో సూర్య టాప్ ప్లేస్లో ఉన్నాడు. అరంగేట్రం చేసిన మొదటి ఏడాదిలోనే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకున్నాడు. 2022లో మొత్తం 42 టీ20లు ఆడిన సూర్య 1408 పరుగులు చేశాడు. 180కి పైగా స్ట్రైక్ రేట్, 44 సగటు సాధించాడు. ఇందులో 2 సెంచరీలు, 12 అర్థసెంచరీలున్నాయి.