
సూర్యాపేట, వెలుగు : అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఈనెల 5న సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి కొత్త బస్టాండ్ వరకు ‘వాక్ ఫర్ బెటర్ ఎన్విరాన్మెంట్’ అనే అంశంపై అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు గ్రీన్ క్లబ్ ట్రస్ట్ అధ్యక్షుడు ముప్పారపు నరేందర్ తెలిపారు.
మంగళవారం సూర్యాపేటలో వాక్ ఫర్ ఎన్విరాన్మెంట్పోస్టర్ ను సుధాకర్ పీవీసీ అధినేత మీలా మహాదేవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి డాక్టర్ తోట కిరణ్, నాయకులు పాల్గొన్నారు.