3.40 లక్షల మెట్రిక్ టన్నులధాన్యం సేకరణ

3.40 లక్షల మెట్రిక్ టన్నులధాన్యం సేకరణ

సూర్యాపేట, వెలుగు : జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు విజయవంతంగా పూర్తయిందని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. గురువారం కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్ రాంబాబుతో కలిసి సివిల్ సప్లై, వ్యవసాయ అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఐకేపీ, మెప్మా, సహకార సంఘాలు, మార్కెటింగ్, వివిధ శాఖలు సమన్వయం చేసుకుంటూ జిల్లాలో 3.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపారు.

 ట్రాక్​ షీట్ ఆన్​లైన్​లో నమోదు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామన్నారు. ఏమైనా పొరపాట్లు జరిగితే వాటిని వచ్చే సీజన్ లో పునరావృతం కాకుండా చూసుకోవాలని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మూడు నెలల సన్నబియ్యం ఒకేసారి పంపిణీ చేయాలన్నారు. జూన్ 30 వరకు సన్నబియ్యం పంపిణీ కొనసాగుతోందని, లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.