పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర విపక్ష ఎంపీల నిరసన కొనసాగుతోంది. రాజ్యసభలో 23 మంది ఎంపీలు లోక్ సభలో నలుగురు ఎంపీలను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ కు గురైన ఎంపీలు రిలే దీక్ష కొనసాగిస్తున్నారు. సస్పెన్షన్ ను నిరసిస్తూ.. 50 గంటల రిలే దీక్ష చేపట్టారు.
దీంతో ఈనెల 27 ఉదయం 11 గంటలకు దీక్షకు దిగారు విపక్ష పార్టీల ఎంపీలు. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు దీక్ష ముగిస్తుంది. సస్పెన్షన్ ఎత్తివేయాలని విపక్షాలు దీక్ష చేస్తుండగా.. తమ షరతులకు అంగీకరిస్తేనే వేటు ఎత్తివేసే పరిస్థితిని పరిశీలిస్తామంది అధికార పార్టీ.
Delhi | Suspended MPs during their 50-hour protest in the Parliament complex
— ANI (@ANI) July 29, 2022
Total 27 MPs including 23 Rajya Sabha MPs and 4 Lok Sabha MPs have been suspended for "unruly behaviour" during the ongoing Monsoon session of Parliament pic.twitter.com/4oaS4q3mlK