దుబాయ్ : అక్టోబర్ 17వ తేదీ నుంచి నవంబర్ 14 వరకు టీ20 వరల్డ్కప్ UAEలోనే నిర్వహించనున్నట్లు ఐసీసీ అనౌన్స్ చేసింది. ఈ మేరకు మంగళవారం ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించిన ఐసీసీ..మొత్తం 16 దేశాలు పాల్గొనే ఈ టోర్నీలోని మ్యాచ్ లు అబుదాబి,షార్జా,దుబాయ్ వేదికగా జరగనున్నట్లు తెలిపింది. ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ లో కేసులు పెరిగిన క్రమంలో వరల్డ్కప్ టోర్నీ నిర్వహణ వేదికలను UAEకి మార్చాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. టోర్నమెంట్ ఫస్ట్ రౌండ్ లో.. క్వాలిఫై అయిన 8 టీమ్స్ .. రెండు గ్రూపులుగా విడిపోతాయి. ఒమన్, యూఏఈ దేశాల్లో రెండు గ్రూపులు మ్యాచ్ లు ఆడనున్నాయి. ఈ టీమ్స్ నుంచి 4 టీమ్లు.. సూపర్12కు ఎంపికవుతాయి. ఆ టీమ్స్ 8 ఆటోమెటిక్ క్వాలిఫైయర్స్తో కలుస్తాయని ఐసీసీ ట్వీట్ చేసింది.