బీఆర్ఎస్ కే అన్నివర్గాల మద్దతు: ఎమ్మెల్యే తలసాని

బీఆర్ఎస్ కే  అన్నివర్గాల మద్దతు: ఎమ్మెల్యే తలసాని

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ లో అన్నివర్గాల ప్రజలు బీఆర్ఎస్​కే  మద్దతు తెలుపుతున్నారని సికింద్రాబాద్ లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్, సనత్ నగర్ ఎమ్మెల్యే  తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం పద్మారావు నగర్ లో పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పదేండ్ల కాలంలో  కేసీఆర్​అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పనులే పార్టీని గెలిపిస్తాయన్నారు. ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారన్నారు. బన్సీలాల్ పేట కార్పొరేటర్ కుర్మ హేమలత , పార్టీ డివిజన్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు, పద్మారావు నగర్ ఇన్ చార్జ్ గుర్రం పవన్ కుమార్ గౌడ్, నేతలు ఏసూరి మహేష్, శ్రీకాంత్ రెడ్డి, పుష్యంత్ రెడ్డి, రమణ, ముక్కా శ్రీనివాస్, అమృత, అనిత, కౌసల్య, దుర్గ  పాల్గొన్నారు.