అభివృద్ధి పనులకు ఎంతైనా ఖర్చు చేస్తం: తలసాని శ్రీనివాస్ యాదవ్

అభివృద్ధి పనులకు ఎంతైనా ఖర్చు చేస్తం: తలసాని శ్రీనివాస్ యాదవ్

పద్మారావునగర్, వెలుగు: అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం సనత్ నగర్ సెగ్మెంట్ పరిధి బన్సీలాల్ పేట డివిజన్ లో రూ. కోటి 96 లక్షల విలువైన 9 అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు.  

ఆయా ప్రాంతాల్లో పాదయాత్ర చేసి జనాల సమస్యలను అడిగి  తెలుసుకున్నారు. భోలక్ పూర్ పరిధి గొల్ల కొమురయ్య కాలనీలో కొత్తగా నిర్మించిన రోడ్డుపై వర్షపు నీరు ప్రవహిస్తోందని స్థానికులు మంత్రికి వివరించారు. సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.  అనంతరం భోలక్ పూర్ లో  ఓటు నమోదు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.  మంత్రి వెంట కార్పొరేటర్ హేమలత, జోనల్ కమిషనర్ రవికిరణ్, డీసీ శంకర్, ఈఈ సుదర్శన్, వాటర్ వర్క్స్ అధికారులు ఉన్నారు.