తమిళనాడులో గవర్నర్ వర్సెస్ సర్కార్

తమిళనాడులో గవర్నర్ వర్సెస్ సర్కార్

చెన్నై : తమిళనాడు గవర్నర్ ఆర్‌‌‌‌ఎన్ రవి తన వద్ద పెండింగ్​లో ఉన్న 10 బిల్లులను గురువారం వెనక్కి పంపారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించిన బిల్లులను క్లియర్ చేయడంలో జాప్యం చేస్తున్న తమిళనాడు, పంజాబ్​ రాష్ట్రాల గవర్నర్లను ఇటీవల సుప్రీంకోర్టు మందలించిన విషయం తెలిసిందే. ఇది "తీవ్ర ఆందోళన కలిగించే అంశం" అని కోర్టు పేర్కొన్న వారం రోజుల తర్వాత తమిళనాడు గవర్నర్​ రవి ఈ బిల్లులను వాపస్​ చేశారు. ఇందులో ప్రభుత్వ వర్సిటీల వీసీలను నియమించడానికి గవర్నర్‌‌‌‌ అధికారాన్ని తగ్గించే బిల్లు

అన్నా డీఎంకేకు చెందిన మాజీ మంత్రులపై విచారణకు అనుమతి కోరుతూ పంపిన బిల్లులు ఉన్నాయి. అయితే, గవర్నర్​ బిల్లులను వాపస్​ చేసిన కొన్ని గంటల్లోనే అసెంబ్లీ స్పీకర్ ఎం.అప్పావు శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఆ బిల్లులను మరోసారి అసెంబ్లీలో ఆమోదించి మళ్లీ గవర్నర్​కు పంపనున్నారు. అయితే, గవర్నర్ కావాలనే బిల్లులను వెనక్కి పంపారని స్టాలిన్​ ప్రభుత్వం ఆరోపించింది.  

also read:    తండ్రి సెంటిమెంట్ కలిసొస్తదా? .. కంటోన్మెంట్ లో ఇద్దరు మహిళల మధ్యే పోటీ