తమిళనాడుకు చెందిన ఓ బిజినెస్ మెన్ తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు దీపావళి బోనస్ గా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లను గిప్ట్ గా ఇచ్చాడు. నీలగిరి జిల్లా కోటగిరి ప్రాంతంలో శివకుమార్కు టీ ఎస్టేట్ ఉంది. దీపావళి కానుకగా తన ఉద్యోగులకు బైక్ కీలను అందజేసి ఆశ్చర్యపరిచాడు. బైక్ లను గిప్ట్ లుగా అందుకున్న వారిలో మేనేజర్ నుంచి డ్రైవర్ వరకు అన్ని స్థాయిల సిబ్బంది ఉన్నారు.
శివకుమార్ .. కోటగిరి ప్రాంతంలో 20 ఏళ్లకు పైగా స్థిరపడ్డాడు. ఇక్కడ, అతను ఒక ఎస్టేట్ కొన్నాడు. ప్రతి సంవత్సరం దీపావళికి ఏదో ఒక స్పెషల్ ప్లాన్ చేసి తన ఉద్యోగులకు బహుమతులు అందించడం శివకుమార్ కు అలవాటు. ఈసారి వారికి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.
ఈ బహుమతితో ఆశ్చర్యానికి గురైన ఉద్యోగులు చాలా సంతోషంగా ఉందన్నారు. ఏడాది పొడవునా కష్టపడి పనిచేసే ఉద్యోగులను ఎప్పటికప్పుడు ఆదుకుంటామని, వారికి వసతి, వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు వారి పిల్లల చదువుకు అయ్యే ఖర్చును మా సంస్థ భరిస్తుందని శివకుమార్ను చెప్పారు. ఏడాది పొడవునా సంస్థ కోసం కష్టపడి పనిచేసే ఉద్యోగులకు కృతజ్ఞతగా చెప్పుకోవడమే కీలకమని అన్నారు.