చెన్నై సౌత్ నుంచి తమిళిసై పోటీ

చెన్నై సౌత్ నుంచి తమిళిసై పోటీ
  •     9 మందితో థర్డ్ లిస్ట్ రిలీజ్ చేసిన బీజేపీ

న్యూఢిల్లీ, వెలుగు: తొమ్మిది మంది అభ్యర్థులతో బీజేపీ మూడో జాబితా విడుదలైంది. తమిళనాడుకు సంబంధించి 9 మంది అభ్యర్థులతో కూడిన లిస్ట్‌‌‌‌ను గురువారం ఆ పార్టీ విడుదల చేసింది. ఇందులో తెలంగాణ మాజీ గవర్నర్‌‌‌‌‌‌‌‌ తమిళిసై చెన్నై సౌత్‌‌‌‌ లోక్‌‌‌‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు పార్టీ  ప్రకటించింది. కేంద్ర సమాచార మంత్రి డాక్టర్‌‌‌‌ ఎల్.మురగన్(నిల్గీర్స్– ఎస్సీ), కె.అన్నామళై– కోయంబత్తూర్, వీపీ సెల్వం– చెన్నై సెంట్రల్, డాక్టర్‌‌‌‌‌‌‌‌ ఏసీ షణ్ముగం– వేలూరు, సి.నరసింహా– కృష్ణగిరి, టీఆర్ పారివేందర్– పెరంబలూర్, నైనార్ నాగేంద్రన్– తూత్తుకూడి, రాధాకృష్ణన్– కన్యాకుమారి నుంచి పోటీ చేయనున్నట్లు లిస్ట్‌‌‌‌లో పార్టీ హైకమాండ్ పేర్కొంది.