రాజ్ భవన్లో ఘనంగా ఉగాది వేడుకలు

రాజ్ భవన్లో ఘనంగా ఉగాది వేడుకలు

రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. రెండున్నరేళ్ల తర్వాత అందరితో కలిసి పండగలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నాడు. రాజ్ భవన్లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న గవర్నర్.. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరికీ అంతా మంచే జరగాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజల కోసం రాజ్ భవన్ ఎప్పుడూ తెరిచే ఉంటుందని తమిళిసై భరోసా ఇచ్చారు. వచ్చే నెల నుంచి జనం సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. గవర్నర్ కన్నా సిస్టర్ ఆఫ్ తెలంగాణగా ఉండటం తనకు సంతోషాన్నిస్తుందని చెప్పారు. 

రాజ్ భవన్లో తమిళిసై ఆధ్వరంలో జరిగిన శుభకృత్ నామ సంవత్సర వేడుకల్లో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సహా వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రులు, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఎవరూ ఉగాది వేడుకలకు హాజరుకాలేదు.