కారేపల్లి, వెలుగు: చెరువు మట్టిని పంట పొలాల్లో వేసుకోవడం వల్ల భూమిలో పోషకాలు పెరిగి అధిక దిగుబడులు సాధించవచ్చని ఖమ్మం డీఏవో ధనసరి పుల్లయ్య తెలిపారు. ప్రజాపాలనలో భాగంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అప్పాయి గూడెం చెరువులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇరిగేషన్ డీఈ వెంకన్న, ఏవో అశోక్ కుమార్, సర్పంచ్ ప్రవీణ్ పాల్గొన్నారు.
