బషీర్బాగ్, వెలుగు : ఒడిశా నుంచి సిటీకి గంజాయిని తీసుకొచ్చి అమ్ముతున్న ఏడుగురు సప్లయర్స్ను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశాకు చెందిన ఎస్కే దన్నా నారాయణగూడ మెల్కోటే పార్క్ సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. సిటీలో గంజాయి సప్లయి చేసేందుకు షేక్ అసిఫ్, ఆరిఫ్ఖాన్ను నియమించుకున్నాడు. ప్రధాన సప్లయర్ దన్నా ఒడిశా నుంచే నారాయణగూడలోని ఇంటి అడ్రస్కు గంజాయిని సప్లయి చేసేవాడు. అసిఫ్, ఆరిఫ్ ఖాన్ సిటీలో గంజాయి ఏజెంట్లు అయిన అబ్దుల్ రహీం, తౌఫీక్ దివాన్ , ముజాహిద్ అలీ ఖాన్లకు వాటిని అందించేవారు.
గంజాయి అమ్మగా వచ్చిన డబ్బులను ఒడిశాకు పంపేవారు. రెండు రోజుల కిందట 5 కేజీల గంజాయిని కటక్ నుంచి సిటీకి ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ ట్రైన్లో దన్నా పంపించాడు. గంజాయిను రిసీవ్ చేసుకున్న అసిఫ్ , ఆరిఫ్ ఖాన్ లోకల్ ఏజెంట్లకు దాన్ని చేరవేస్తుండగా నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లాలా గూడలో ఇద్దరు గంజాయి తాగే సుశీల్ కుమార్ , సాయి కార్తీక్ లతో పాటు సప్లయర్లు ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.