వరంగల్‍లో పొలిటికల్ హీట్.. రాజయ్యతో రాజనరసింహ భేటీ

వరంగల్‍లో పొలిటికల్ హీట్.. రాజయ్యతో రాజనరసింహ భేటీ

బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనరసింహ భేటీ కావడం ఉమ్మడి వరంగల్ లో పొలిటికల్ హీట్ పెంచింది. 

వరంగల్ లోని ఓ హోటల్ లో తన వర్గీయులతో  కలిసి రాజయ్య.. దామోదరను కలిశారు. బీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారా అనే వార్తలు గుప్పుమన్నాయి. 

తాజా భేటీ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలోకి రాజయ్య చేరిక లాంఛనమే అంటున్నారు ఆయన వర్గీయులు. తాజా భేటీతో వరంగల్ లో రాజకీయ సమీకరణాలు మారుతాయని పొలిటికల్ స్ట్రాటజిస్టులు అంటున్నారు. ఇవాళ ఉదయం రాజయ్య మాట్లాడుతూ.. స్టేషన్ ఘనపూర్ టికెట్టు(కడియం శ్రీహరికి ఇచ్చారు) విషయంలో సీఎం కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.