వైసీపీ నేతలకు ఓణీల ఫంక్షన్

వైసీపీ నేతలకు ఓణీల ఫంక్షన్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్నాయి. అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య జరిగిన వాగ్వాదంతో... రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజికీయాలు హాట్ టాపిక్ గా మారియి. అసెంబ్లీ వేదికగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ.. టీడీపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.దీంతో తెలుగు తమ్ముళ్లు ఎక్కడికక్కడ నిరసనలకు దిగుతున్నారు. తాజాగా నారా భువనేశ్వరీపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ విశాఖలో టీడీపీ మహిళా నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఐదుగురు మహిళలు వైసీపీ నేతలు ముఖాలను ఫేస్ మాస్క్ లుగా దరించారు. 

సీఎం జగన్, విజయసాయిరెడ్డి, కొడాలి నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ మాస్కులు మహిళలకు తగిలించారు. వారందరికీ హారతి ఇచ్చారు. వారికి ఆకులు, వక్కలు, జాకెట్లు ఇచ్చి ఓణీల ఫంక్షన్ నిర్వహించారు.  మహిళలను కించపరిచిన వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు టీడీపీ మహిళా నేతలు.