- హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద టీచర్ల సంఘాల ధర్నా
హైదరాబాద్ వెలుగు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక చర్యల్లో భాగంగా తీసుకొచ్చిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని.. బదిలీలు, పదోన్నతులను వెంటనే చేపట్టాలని టీఎస్యూటీఎఫ్ నాయకులు శనివారం హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వెంటనే కొత్త పీఆర్సీ కమిటీని నియమించి జులై 1 నుంచి వర్తించేలా ఐఆర్ ను ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఈహెచ్ఎస్ ను సమర్థంగా అమలు చేయాలన్నారు. టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రవీందర్, టీఎస్యూటీఎఫ్, టీపీటీఎఫ్, డీటీఎఫ్ సంఘాల టీచర్లు పాల్గొన్నారు.