
టీమిండియాకు బ్యాడ్ న్యూస్. జూన్ 2023లో ఇంగ్లండ్లో జరిగే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు టీమిండియా బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్ దూరమయ్యాడు. వెన్ను గాయంతో బాధపడుతున్న అతడు..ఆస్ట్రేలియాతో జరిగేWTC ఫైనల్లో ఆడడం లేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. గాయం తీవ్రత కారణంగా ప్రస్తుతం ఐపీఎల్ 2023 నుంచి కూడా వైదొలిగాడు.
అయ్యర్ కు శస్త్ర చికిత్స
వెన్నునొప్పితో బాధపడుతున్న శ్రేయాస్ అయ్యర్.. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆడాలన్న లక్ష్యంతో సర్జరీకి దూరంగా ఉండాలని భావించాడు.అయితే ఫిట్నెస్ సాధించే క్రమంలో వెన్ను నొప్పి తీవ్రత మరింత పెరగడంతో సర్జరీ చేయించుకోక తప్పని పరిస్థితి నెలకొంది. సర్జరీ కోసం శ్రేయాస్ అయ్యర్ విదేశాలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీని కారణంగా అతను కనీసం 3 నెలలు ఆటకు దూరమయ్యే అవకాశాలున్నాయి.