తొలి టెస్టులో ఇండియా గ్రేట్ విక్టరీ

తొలి టెస్టులో ఇండియా గ్రేట్ విక్టరీ

సెంచూరియన్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో విక్టరీ సాధించింది టీమిండియా. సౌతాఫ్రికాపై 113 పరుగుల తేడాతో గెలిచింది. రెండో ఇన్నింగ్స్ షమీ, బూమ్రాలు చేరో మూడు వికెట్లు తీయగా... అశ్విన్, సిరాజ్ చేరో రెండు వికెట్లు తీశారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారత్ 327పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. కేఎల్ రాహుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. సౌతాఫ్రికా 197 పరుగలకే ఫస్ట్ ఇన్నింగ్స్ ముగించింది. షమీ ఐదు వికెట్లు తీసి ఆకట్టుకున్నారు.  తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో భారత్ 174 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రబడా, జాన్సిన్ చేరో నాలుగు వికెట్లు తీశారు. సౌతాఫ్రికా సెకండ్ ఇన్నింగ్స్ లో 304 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 191 పరుగులకే ఆలౌట్ అయ్యింది.