టీమిండియా మహిళా క్రికెటర్ తల్లి కరోనాతో మృతి

టీమిండియా మహిళా క్రికెటర్ తల్లి కరోనాతో మృతి

కరోనా వైరస్ తోఇప్పటికే టీమిండియా మాజీ క్రికెటర్లు పియూష్‌ చావ్లా, ఆర్పీ సింగ్‌ తమ తండ్రులను కోల్పోగా.. టీమిండియా మహిళా క్రికెటర్‌ వేదా కృష్ణమూర్తి రెండు వారాల వ్యవధిలో సోదరిని, తల్లిని కోల్పోయింది. తాజాగా మరో టీమిండియా మహిళా క్రికెటర్‌ ప్రియా పూనియా తల్లి కరోనాతో చనిపోయారు. విషయాన్ని ప్రియా పూనియా స్వయంగా తెలిపింది. 

కరోనా వైరస్ చాలా ప్రమాదకరమైందని, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతికదూరం పాటిస్తూ, సురక్షితంగా ఉండాలని ప్రియా పూనియా కోరారు.