
Genpact News: అమెరికాకు చెందిన టెక్నాలజీ అండ్ సర్వీస్ సంస్థ జెన్ప్యాక్ట్ వివాదాస్పదమైన పనిగంటలను ప్రకటించింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల పని సమయాలు తగ్గించాలని తమ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతింటోందని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జెన్ప్యాక్ట్ మాత్రం తన ఉద్యోగులు రోజుకు 10 గంటల పాటు పనిచేయాల్సిందేనని హుకుం జారీ చేసింది.
జెన్ప్యాక్ట్ చేసిన తాజా ప్రకటనపై ఉద్యోగుల నుంచే కాకుండా హెచ్ఆర్ నిపుణుల నుంచి కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జూన్ మధ్య నుంచి ఈ కొత్త పనిగంటలను కంపెనీ అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే దీనిని పాటించని వ్యక్తులు లేదా ఉద్యోగుల పర్ఫామెన్స్ రివ్యూ సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. రోజూ పనిగంటలను కంపెనీ పెంచినప్పటికీ దానికి అనుగుణంగా బేసిక్ శాలరీలో మాత్రం ఎలాంటి మార్పులను ప్రకటించలేదు. అయితే ఉద్యోగులు దీనిని ఫాలో అవుతున్నారా లేదా గుర్తించటానికి ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ టూల్స్ ఉపయోగించాలని నిర్ణయించింది. ఇది ఉద్యోగి ఎన్ని గంటలు యాక్టివ్ గా పనిచేశారనే వివరాలను సేకరిస్తుంది.
ALSO READ | విశాఖపట్నంలో కాగ్నిజెంట్ రూ.1,582 కోట్ల పెట్టుబడి
రోజుకు పది గంటలు పనిచేసే ఉద్యోగులకు నెలకు 500 పాయింట్లు అంటే దాదాపు రూ.3వేలు అదనపు ఆదాయం పొందవచ్చని తెలుస్తోంది. అలాగే గడువుకు మించి పనిచేసే ప్రతి అదనపు గంటకు అదనంగా 5% బోనస్, అంటే దాదాపు రూ.150 చెల్లించనున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం హైదరాబాద్ క్యాంపస్ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తోందని వెల్లడైంది. వాస్తవానికి కంపెనీ ఈ విషయాన్ని హెచ్ఆర్ చానల్ ద్వారా ఉద్యోగులకు వెల్లడించకుండా టీమ్ లీడ్స్ ద్వారా అనధికారికంగా సమాచారాన్ని ఇవ్వటం గందరగోళానికి దారితీసింది.
దీనిపై కంపెనీలో పనిచేస్తున్న అభిషేక్ శర్మ అనే ఉద్యోగి స్పందిస్తూ.. ఉద్యోగులు రోజురోజుకూ మెరుగైన పనితీరు దిశగా ప్రయాణిస్తున్నప్పుడు 10 గంటల పాటు ఖచ్చితంగా పనిచేయాలనటం వారి వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ప్రొడక్టివిటీ, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. అలాగే ప్రపంచ పనిలో సామర్థ్యం, వేగం వైపు పయనిస్తుంటే కంపెనీ మాత్రం ఎన్ని గంటలు పనిచేశామనిదానిపై ఫోకస్ పెట్టడం సరికాదన్నారు. ఎక్కువ పనిగంటలు ఉద్యోగులను బర్న్అవుట్ కి గురిచేస్తాయని వెల్లడించారు.