విశాఖపట్నంలో కాగ్నిజెంట్‌ రూ.1,582 కోట్ల పెట్టుబడి

విశాఖపట్నంలో కాగ్నిజెంట్‌ రూ.1,582 కోట్ల పెట్టుబడి

విశాఖపట్నం : ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ విశాఖపట్నంలో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయడానికి రూ. 1,582 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 21.31 ఎకరాల భూమిని నామమాత్ర ధర 99 పైసలకు కేటాయించనుంది.  ఈ ప్రాజెక్ట్ రాబోయే కొన్ని సంవత్సరాల్లో 8 వేల ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా.  

విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌‌మెంట్ అథారిటీ పరిధిలోని కపులుప్పాడలో 21.31 ఎకరాల భూమిని కాగ్నిజెంట్ కోరిందని ఈ  రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.  కంపెనీ మార్చి 2029 నాటికి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. విశాఖపట్నంలో విస్తరణ కోసం ఈ ప్రాజెక్ట్‌‌ను కాగ్నిజెంట్ సొంత నిధులతో నిర్మించనుంది. 

ఇటీవల, ఆంధ్రా ప్రభుత్వం టీసీఎస్‌‌కు  విశాఖపట్నంలో 21 ఎకరాల భూమిని నామమాత్ర ధర 99 పైసలకు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ క్యాంపస్‌ ద్వారా 10 వేల  ఉద్యోగాలు వస్తాయని అంచనా.