బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానాన్ని కర్ణాటకలోని విద్యానగర్ ఎయిర్ పోర్టుకు మళ్లించారు. టేకాఫ్ సమయంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో విద్యానగర్ ఎయిర్ పోర్టుకు తరలించారు. నడ్డా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోవడానికి మరో 40 నిమిషాలు పట్టే అవకాశముందని ఎయిర్ పోర్టు వర్గాలు తెలిపాయి.
షెడ్యూల్ ప్రకారం నడ్డా మధ్యాహ్నం 2.10 గంటలకే శంషాబాద్ చేరుకోవాల్సివుంది. కరీంనగర్లో జరిగే ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో ఆయన పాల్గొననున్నారు. కరీంనగర్లో జరుగుతున్న ఈ సభకు పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చారు.