కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించేదిలేదంటూ తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం

కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించేదిలేదంటూ తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం

 కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించేదిలేదంటూ తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 12వ తేదీ సోమవారం అసెంబ్లీలో  కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించబోమని నీటి పారుదల శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కృష్ణా ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ తీర్మానం చర్చ నేపథ్యంలో అధికారపక్షం, ప్రతిపక్షం మధ్య అసెంబ్లీలో వాడీ వేడీచర్చ జరిగింది. 

ఈక్రమంలో ఇరుపక్షాల సభ్యుల మధ్య మాటలయుద్ధం నడిచింది.అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి ప్రతిపక్ష సభ్యులు బలపరుస్తున్నట్లు తెలిపారు. దీంతో స్పీకర్ ఈ తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం మంగళవారానికి అసెంబ్లీని స్పీకర్ వాయిదా వేశారు.