అసెంబ్లీలో 2022 ,2023 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రవేశ పెట్టారు. రూ. 2,56,958.51 కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టారు మంత్రి హరీశ్.
మొత్తం బడ్జెట్ వివరాలు
- మొత్తం బడ్జెట్ 2,56,958.51 లక్షల కోట్లు
- 1,89,274.82 రెవెన్యూ వ్యయం.
- 29,728.44 కోట్ల క్యాపిటల్ వ్యయం.
- దళిత బంధుకు 17,700 వేల కోట్లు.
- 11 వేల 800 కుటుంబాలకు లబ్ది.
- గ్రామ పంచాయితీ లకు ప్రతినెలా 227.5 కోట్లు.
- పట్టణ ప్రగతికి 1394 కోట్లు.
- మన ఊరు , మన బడి కోసం 3497 కోట్లు.9123 పాఠశాలలు.
- వెయ్యి కోట్లతో 2.5 లక్షల ఆయిల్ ఫామ్ సాగుకు కేటాయింపు.
- 24254 కోట్లు వ్యవసాయ శాఖకు.
- ఇరిగేషన్ కు 22675 కోట్లు
- హరిత హారానికి 932 కోట్లు
- అసరకు 11728 కోట్లు.
- కల్యాణ లక్ష్మీ , షాది ముబారక్ లకు 2750 కోట్లు.
- సొంత జగ ఉన్న వాళ్లకు ఇళ్ళు కట్టుకోవడానికి మూడు లక్షలు.
- డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం 12 వేల కోట్లు.
- గిరిజన సంక్షేమం కోసం 12, 565 కోట్లు.
- బీసీ సంక్షేమం కోసం 5698 కోట్లు.
- బ్రాహ్మణ సంక్షేమం కోసం 117 కోట్లు.
- ఆర్ అండ్ బి కోసం 1,542 కోట్లు.