బడ్జెట్ కు ఆమోదం తెలిపిన కేబినెట్

బడ్జెట్ కు ఆమోదం తెలిపిన కేబినెట్

హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రేపటి నుంచి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో ఈరోజు సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన కేబినేట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రేపు మంత్రి ఆర్ధిక మంత్రి హరీశ్ రావు  బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ రెండున్నర లక్షల కోట్లకు పైగా ఉండే అవకాశముంది. గత ఏడాది రూ.2 లక్షల 30వేల కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు అసుసరించాల్సిన అంశాల గురించి మంత్రులకు సీఎం దిశానిర్థేశం చేసినట్లు సమాచారం.

మరిన్ని వార్తల కోసం: 

కేటీఆర్ రాజీనామా వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్

మెస్‌లో కాల్పులు.. ఐదుగురు బీఎస్ఎఫ్ జవాన్ల మృతి