మార్చి 11న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ కేబినెట్ భేటీకి మంత్రులు, ఉన్నాతాధికారులు హాజరు కానున్నారు. ఈ కేబినెట్ భేటీలో పలు కీలకమైన అంశాలపై చర్చించనున్నారు. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మార్చి 11నే సీఎం రేవంత్ శ్రీకారం చుట్టనున్నారు.
తొలుత ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ వర్తింపజేసేలా విధివిధానాలను ఖరారు చేయాలని అధికారులను సీఎం ఇప్పటికే ఆదేశించారు. సొంత జాగా ఉన్నవారికి అదే స్థలంలో ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు మంజూరు చేస్తామని ఎన్నికల టైమ్ లోనే కాంగ్రెస్ హామీ ఇచ్చింది.