బషీర్బాగ్, వెలుగు: అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని తెలంగాణ కేబుల్ టీవీ జేఏసీ కన్వీనింగ్, నిర్వహణ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బుధవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కమిటీ ప్రతినిధులు బి.నరసింహాచారి, బరిగెల శివ, యాసిఫ్ పాషా, పొదుల్ల వెంకట్ మాట్లాడుతూ.. కేబుల్ టీవీ జర్నలిస్టులకు రాష్ట్ర స్థాయి హోదా కార్డులు ఇవ్వాలని, నెట్వర్క్ ఉన్న ప్రతి జిల్లాలో ఆరు కార్డులకు అవకాశం కల్పించాలని కోరారు. కేబుల్ టీవీలకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వడంతో పాటు జిల్లాల్లో స్టూడియోల నిబంధనలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రతి కేబుల్ టీవీకి అసెంబ్లీ పాస్లు ఇచ్చి ప్రోత్సహించాలని కోరారు.
