త్వరలో సిద్దిపేటకు ఎయిర్‌పోర్ట్ వచ్చే అవకాశం

త్వరలో సిద్దిపేటకు ఎయిర్‌పోర్ట్ వచ్చే అవకాశం

సిద్దిపేట:సిద్దిపేటకు త్వరలో ఎయిర్‌పోర్టు వచ్చే అవకాశం ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. గురువారం నాడు సిద్దిపేట నియోజకవర్గంలో పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. సిద్దిపేట పరిధిలో నాగుల బండ వద్ద ఐటీ టవర్ కు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం సిద్దిపేటలో టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని ఆయన ప్రారంభించారు. ఇదే నియోజకవర్గంలోని మిట్టపల్లి గ్రామంలో రైతు వేదిక ను సీఎం ప్రారంభించారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో సీఎం బహిరంగసభను ఏర్పాటు చేయనున్నారు. సిద్దిపేట చాలా డైనమిక్ ప్రాంతమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. త్వరలో సిద్దిపేటకు ఎయిర్‌పోర్ట్ వచ్చే అవకాశం ఉందన్నారు.