కైకాల పార్థివ దేహానికి సీఎం కేసీఆర్ నివాళి

కైకాల పార్థివ దేహానికి సీఎం కేసీఆర్ నివాళి

ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ భౌతికాయానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. ఫిలింనగర్ లోని నివాసానికి చేరుకున్న కేసీఆర్.. కైకాల భౌతికాయానికి పూలమాల వేశారు. అనంతరం కైకాల సతీమణితో పాటు కుటుంబసభ్యులను పరామర్శించారు. కాసేపు వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. కైకాల సత్యనారాయణ మరణం చలన చిత్ర రంగానికి తీరని లోటని సీఎం కేసీఆర్ అన్నారు. నటుడిగా పలు విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తన వైవిధ్యమైన నటన ద్వారా మూడు తరాల తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని సీఎం గుర్తుచేసుకున్నారు.

కైకాల సత్యనారాయణ భౌతికాయానికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.