వరి కుప్పపై మరణించిన రైతు ఫ్యామిలీకి జగ్గారెడ్డి పరామర్శ

వరి కుప్పపై మరణించిన రైతు ఫ్యామిలీకి జగ్గారెడ్డి పరామర్శ

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. రెండు నెలల నుంచి రైతులకు గోనె సంచులు ఇవ్వకుండా రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. సిద్దిపేట జిల్లా నుంగునూర్ మండలం బద్ధిపడిగలో ఇటీవల వరి కుప్పపై చనిపోయిన రైతు రాములు కుటుంబాన్ని పరామర్శించారు జగ్గారెడ్డి. ఆ కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించారాయన. ఆరు నెలలు కష్టపడి పండించిన పంట అమ్ముకోవడానికి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు జగ్గారెడ్డి.